మమతపై గెలుపు: స్పందించిన సువేంధు అధికారి

ABN , First Publish Date - 2021-05-03T02:29:11+05:30 IST

ఆదివారం నందిగ్రామ్ పూర్తి ఫలితం విడుదలైన తర్వాత సువేందు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘నాపై అమితమైన ప్రేమ, నమ్మకం, మద్దతుతో పాటు మీ ఆశీర్వాదాలు అందించిన నందిగ్రామ్ ప్రజలకు నా హృదయపూర్వక

మమతపై గెలుపు: స్పందించిన సువేంధు అధికారి

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీపై విజయం సాధించి సువేంధు అధికారి సంచలన సృష్టించారు. బెంగాల్‌లో టీఎంసీ ఇప్పటికే 60 స్థానాల్లో అధికారికంగా విజయం సాధించి మరో 150 స్థానంలో గెలుపుకు దగ్గరగా ఉంది. రాష్ట్రంలో టీఎంసీ గాలి ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ మమతా బెనర్జీని సువేందు ఓడించడం పెద్ద విషయంగా చెప్పుకుంటున్నారు. కాగా తన విజయం పట్ల సువేందు సంతోషం వ్యక్తం చేశారు. నందిగ్రామ్ ప్రజలకు సేవ చేసేందుకు, వారికి సంక్షేమ పథకాలు అందించేందుకు తన బాధ్యత ముగిసిపోదని అన్న ఆయన ఆ విషయాన్ని గుర్తు చేసిన నందిగ్రామ్ ఓటర్లు మరోసారి నిరూపించారని హర్షం వ్యక్తం చేశారు.


ఆదివారం నందిగ్రామ్ పూర్తి ఫలితం విడుదలైన తర్వాత సువేందు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘నాపై అమితమైన ప్రేమ, నమ్మకం, మద్దతుతో పాటు మీ ఆశీర్వాదాలు అందించిన నందిగ్రామ్ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నందిగ్రామ్ ప్రజలకు ప్రజలకు సేవ చేసేందుకు, వారికి సంక్షేమ పథకాలు అందించేందుకు నా బాధ్యత ఎప్పుడూ తీరిపోదని గుర్తు చేస్తూ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు గర్వంగా ఉంది’’ అని రాసుకొచ్చారు.

Updated Date - 2021-05-03T02:29:11+05:30 IST