టీడీపీ హయాంలో టీటీడీలో నాలుగు కోట్ల కుంభకోణం

ABN , First Publish Date - 2021-04-10T22:09:15+05:30 IST

టీడీపీ హయాంలో టీటీడీలో నాలుగు కోట్ల కుంభకోణం

టీడీపీ హయాంలో టీటీడీలో నాలుగు కోట్ల కుంభకోణం

విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో నాలుగు కోట్ల కుంభకోణం జరిగిందని పరిపూర్ణానంద స్వామి ఆరోపించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ఢిల్లీలో ఉన్న టీటీడీకి సంబంధించిన అంశంలో ఈ నాలుగు కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఈ కుంభకోణం జరిగినపుడు టీటీడీ అనుబంధ సేవా సంస్థకు అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ అధికారిగా ఉన్నారని ఆయన తెలిపారు. టీడీపీ హయాంలో ఈ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు కీలక అధికారిగా కొనసాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. 


ఈ‌ కుంభకోణంపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కార్యాలయ అధికారులు కూడా ఈ‌ కుంభకోణంపై పట్టనట్లుగా ఉన్నారని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను కూడా అధికారులు ప్రస్తుతం అణచి పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ అక్రమాలు సీఎంకు తెలియకుండా దాచారనే అనుమానం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని హిందువుల గురించి జగన్మోహన్ రెడ్డి ఏమీ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. 

Updated Date - 2021-04-10T22:09:15+05:30 IST