ధార్మిక శక్తులు ఏకం కావాలి

ABN , First Publish Date - 2021-08-03T05:59:49+05:30 IST

హిందూ ధర్మం, మతంపై జరుగు తున్న దాడులను ఎదు ర్కొనేందుకు హిందూ ధార్మిక శక్తులు ఏకం కా వాలని శృంగవృక్షం పీఠాధి పతి శ్రీ దత్త నాగేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు.

ధార్మిక శక్తులు ఏకం కావాలి
క్షీరారామంలో శ్రీదత్త నాగేంద్ర సరస్వతి స్వామీజీ

పాలకొల్లు అర్బన్‌, ఆగస్టు 2: హిందూ ధర్మం, మతంపై జరుగు తున్న దాడులను ఎదు ర్కొనేందుకు హిందూ ధార్మిక శక్తులు ఏకం కా వాలని శృంగవృక్షం పీఠాధి పతి శ్రీ దత్త నాగేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. క్షీరా రామలింగేశ్వరస్వామిని దర్శించిన అనంతరం హిందూ సంస్థల ప్రతినిధులతో స్వామీజీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలపై దాడులు, దైవ దూషణ, విగ్రహాలు, రథాలు ధ్వంసం, మత మార్పిడి పెరిగిపోతున్నాయని, వీటిని ఎదు ర్కోవడానికి హిందూ ధార్మిక శక్తులను ఏకం చేయాలన్న సంకల్పంతో వివిధ మఠాధిపతులు కృషి చేస్తున్నారని స్వామీజీ తెలిపారు. దేవస్థానం చైర్మన్లు కోరాడ శ్రీనివాసరావు, గాదె వెంకన్న, కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T05:59:49+05:30 IST