‘స్వామీ.. దర్శనమేదీ’ కథనంపై ఆరా
ABN , First Publish Date - 2021-10-22T06:13:53+05:30 IST
సత్యదేవుడి దర్శనానికి భక్తులను కొవిడ్ ఆంక్షల పేరుతో సాయంత్రం 5.30 వరకే పరిమితం చేయడంపై ‘స్వామీ.. దర్శనమేదీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన కథనంపై దేవదాయ కమిషనర్ ఆరా తీశారు.
కలెక్టర్ అనుమతి లేదంటూ వివరణ
అన్నవరం, అక్టోబరు 21: సత్యదేవుడి దర్శనానికి భక్తులను కొవిడ్ ఆంక్షల పేరుతో సాయంత్రం 5.30 వరకే పరిమితం చేయడంపై ‘స్వామీ.. దర్శనమేదీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన కథనంపై దేవదాయ కమిషనర్ ఆరా తీశారు. దీనిపై దేవస్థానం ఈవో త్రినాథరావు వివరణ ఇచ్చినట్టు సమాచారం. జిల్లా కలెక్టర్ అనుమతికోసం ఎదురుచూస్తున్నామని, ఆదేశాలు వచ్చిన వెంటనే యథావిధిగా రాత్రి 9 గంటల వరకు అనుమతించేందుకు సిద్ధంగా ఉండడంతోపాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్టు ఈవో కార్యాలయం నుంచి దేవదాయ కమిషనర్ కార్యాలయానికి మెయిల్ చేసినట్టు తెలిసింది.