స్వర్ణ ప్యాలెస్‌ ఘటన దురదృష్టకరం: ఆళ్లనాని

ABN , First Publish Date - 2020-08-09T18:19:57+05:30 IST

స్వర్ణ ప్యాలెస్‌ ఘటన చాలా దురదృష్టకరమని మంత్రి ఆళ్లనాని అన్నారు.

స్వర్ణ ప్యాలెస్‌ ఘటన దురదృష్టకరం: ఆళ్లనాని

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్‌ ఘటన చాలా దురదృష్టకరమని మంత్రి ఆళ్లనాని అన్నారు. విజయవాడలో ఆదివారం తెల్లవారు జామున స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సంఘటనా ప్రదేశానికి చేరుకుని సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్‌ స్పందించారని.. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ప్రకటించారని చెప్పారు. స్వర్ణ ప్యాలెస్‌లో 30 మంది బాధితులు కరోనా చికిత్సపొందుతున్నారని, 10 మంది మృతి చెందగా మరో 20 మందికి వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. జరిగిన ప్రమాదంపై కలెక్టర్, అధికారులతో సమీక్ష చేస్తున్నామని, సమీక్ష ముగిసిన తర్వాత అన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తామని ఆళ్లనాని చెప్పారు.

Updated Date - 2020-08-09T18:19:57+05:30 IST