స్వర్ణ ప్యాలెస్ ఘటన : బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా
ABN , First Publish Date - 2020-08-15T01:34:04+05:30 IST
నగరంలోని స్వర్ణ పాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో
విజయవాడ : నగరంలోని స్వర్ణ పాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో నిందితుల బెయిల్ పిటిషన్పై కోర్టు ఇవాళ విచారించింది. సుధీర్ఘ విచారణ అనంతరం తీర్పు సోమవారానికి వాయిదా వేసింది. ముగ్గురు నిందితులను కస్టడికి ఇవ్వాలని పోలీసుల పిటిషన్లో కోరారు. ప్రస్తుతం నిందితులు మచిలీపట్నం సబ్జైలులో ఉన్నారు. రమేష్ ఆస్పత్రి ఎండీ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.