‘పరారీలో స్వర్ణప్యాలెస్, రమేష్ హాస్పిటల్ యాజమాన్యం’

ABN , First Publish Date - 2020-08-12T21:18:11+05:30 IST

రమేష్ హాస్పిటల్ యాజమాన్యం, స్వర్ణ ప్యాలెస్ యజమాని ముత్తవరపు శ్రీనివాసరావు పరారీలో ఉన్నారని ఏసీపీ సూర్యచంద్రరావు వెల్లడించారు. రమేష్ ఆస్పత్రి సిబ్బంది అధిక

‘పరారీలో స్వర్ణప్యాలెస్, రమేష్ హాస్పిటల్ యాజమాన్యం’

విజయవాడ: రమేష్ హాస్పిటల్ యాజమాన్యం, స్వర్ణ ప్యాలెస్ యజమాని ముత్తవరపు శ్రీనివాసరావు పరారీలో ఉన్నారని ఏసీపీ సూర్యచంద్రరావు వెల్లడించారు. రమేష్ ఆస్పత్రి సిబ్బంది అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. స్వర్ణప్యాలెస్ ప్రమాదంపై విచారణ నేపథ్యంలో ఏసీపీ సూర్యచంద్రరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘటనకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. రోగులకు సిటీ స్క్రీన్ చేసి కోవిడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పి రోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఎనిమిది ప్రత్యేక బృందాలు రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం, హోటల్ యాజమాన్యం కోసం గాలింపు కొనసాగిస్తున్నాయని ఏసీపీ తెలిపారు. వారి కుటుంబ సభ్యులపైనా నిఘా పెట్టామని, వారి కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నామని ఏసీపీ చెప్పారు.

Updated Date - 2020-08-12T21:18:11+05:30 IST