టీటీడీ వివాదంపై ప్రభుత్వానికి స్వరూపానంద కీలక సూచనలు
ABN , First Publish Date - 2020-05-25T23:14:37+05:30 IST
టీటీడీ వివాదంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు.
విశాఖ: టీటీడీ వివాదంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. దేవాదాయశాఖ మంత్రి, టీటీడీ చైర్మన్తో ఆయన మాట్లాడారు. టీటీడీ వ్యవహారంలో వివాదాలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. టీటీడీ తీసుకునే ప్రతి నిర్ణయం భక్తుల మనోభావాలకు ముడిపడి ఉంటుందన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించేలా నిర్ణయం తీసుకోవడం మంచిదన్నారు. వివాదాలకు తెరదించేలా నిర్ణయాలు తీసుకోవాలని టీటీడీకి సూచించారు.