ముగిసిన స్వాతి వేడుకలు

ABN , First Publish Date - 2021-06-22T05:28:57+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలు సోమవారం ముగిశాయి.

ముగిసిన స్వాతి వేడుకలు
ఉత్సవమూర్తులను అభిషేకిస్తున్న వేదపండితులు

ఆళ్లగడ్డ, జూన్‌ 21: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలు సోమవారం ముగిశాయి.   సుదర్శన హోమం, 108 కలశాలతో అభిషేకాలు చేపట్టారు. స్వాతి వేడుకలను పురస్కరించుకోని ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి కాలినడకన నవనరసింహక్షేత్రాలను దర్శించుకోని పూజలు సోమవారం చేశారు.  ఆయనకు పూర్ణకుంభంతో ఈవో నరసయ్య, వేదపండితులు స్వాగతం పలికారు.పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సతీమణి ఉమామహేశ్వరమ్మ అహోబిలం లక్ష్మీనరసింహస్వామిని సోమవారం దర్శించుకొని పూజలు చేశారు. ఈమెకు   ఆలయ ఈవో నరసయ్య, వేదపండితులు ఆహ్వానం పలికారు. 




Updated Date - 2021-06-22T05:28:57+05:30 IST