సెల్ఫ్ గోల్.. భారత మహిళల ఓటమి
ABN , First Publish Date - 2021-10-22T08:52:18+05:30 IST
స్వీడన్కు చెందిన టాప్ క్లబ్ హామర్బీ ఐఎఫ్తో జరిగిన స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ను భారత మహిళలు సెల్ఫ్ గోల్తో చేజార్చుకున్నారు.
స్టాక్హోం: స్వీడన్కు చెందిన టాప్ క్లబ్ హామర్బీ ఐఎఫ్తో జరిగిన స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ను భారత మహిళలు సెల్ఫ్ గోల్తో చేజార్చుకున్నారు. దాంతో ఆతిథ్య జట్టు 3-2తో నెగ్గింది. ఇందుమతి (30వ ని.) మనీసా పన్నా (40) భారత్ తరపున గోల్స్ చేశారు. జాకబ్సన్ (36), అమందా (52వ) ఆతిథ్య జట్టుకు గోల్స్ అందించగా..రంజనా చాను (78) చేసిన సెల్ఫ్ గోల్తో భారత్ పరాజయం చవిచూసింది.