ఈతకు వెళ్లి యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-05-12T06:38:58+05:30 IST
ఈత సరదా యువకుడి ప్రాణాలను బలి తీసు కుంది.
బి.కొత్తకోట, మే 11: ఈత సరదా యువకుడి ప్రాణాలను బలి తీసు కుంది. మదన పల్లె పట్టణం ఇండ స్ట్రి యల్ ఎస్టేట్ సమీపం లోని సత్య సాయి కాలనీకి చెందిన కె.గోపాల్ కుమారుడు రెడ్డిశేఖర్(23) మంగళవారం బి.కొత్తకోట మండలంలో నీటమునిగి మృతి చెందాడు. మదనపల్లెకు చెందిన రెడ్డిశేఖర్ బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన స్నేహితులతో కలిసి సమీ పంలోని బడికాయలపల్లె పెద్ద చెరువుకు ఈతకు వెళ్లారు. రెడ్డిశేఖర్ ఈత కొడుతూ ఊపిరాడక చెరువులో మునిగి పోయాడు. గమనించిన స్నేహితులు బడికాయలపల్లె యువకుల సాయంతో చెరువు నుంచి వెలుపలికి తీయగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ విషయంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు చెప్పారు.