స్విమ్మింగ్లో తెలంగాణ జోరు
ABN , First Publish Date - 2021-10-21T09:21:56+05:30 IST
జాతీయ జూనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్లో బుధవారం జరిగిన రెండోరోజు పోటీల్లో తెలంగాణకు ఏడు పతకాలు లభిం చాయి.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ జూనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్లో బుధవారం జరిగిన రెండోరోజు పోటీల్లో తెలంగాణకు ఏడు పతకాలు లభిం చాయి. బాలికల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో విృతి అగర్వాల్, బాలురలో యశస్వి రజతాలు సాధించారు. బాలుర 200 మీ. బ్యాక్స్ట్రోక్లో సాయినిహార్, బాలికల 100 మీ. బ్యాక్స్ట్రోక్లో నిత్య, బాలురలో సుహాస్ ప్రీతమ్ కాంస్యాలు దక్కించుకు న్నారు. బాలికల 4్ఠ200 మీ.లో, 4్ఠ100 మీ.లో అనికా, నిత్య, రిత్విక, మోక్షిత కలిసి కాంస్య పతకాలు నెగ్గారు.