స్విమ్స్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. పేషెంట్ మృతి

ABN , First Publish Date - 2021-06-13T17:41:55+05:30 IST

స్విమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పేషెండ్ మృతి చెందాడు.

స్విమ్స్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. పేషెంట్ మృతి

తిరుపతి: స్విమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పేషెండ్ మృతి చెందాడు. వినోద్ కుమార్ అనే యువకుడికి పెట్టిన ఆక్సిజన్ మాస్కు ఊడిపోయినా సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో అతను మృతి చెందాడు. స్విమ్స్‌కు తీసుకురాక ముందు మదనపల్లిలో ఆనందబాబు ప్రైవేటు వైద్యశాలలో దోచుకున్నారని వినోద్ తండ్రి వాపోయారు. డాక్టర్ ఆనందబాబు, ఆయన సహాయకుడు సూది మందు వేయాలని మూడున్నర లక్షలు తీసుకున్నారని, అయినా సీరియస్ అవటంతో స్విమ్స్‌కు తీసుకువచ్చామని, ఇక్కడ కోలుకున్నాడని, అయినా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చనిపోయాడని వినోద్ తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు.

Updated Date - 2021-06-13T17:41:55+05:30 IST