కాంగ్రెస్ నేత స్విస్ ఖాతా వివరాల వెల్లడిపై స్విట్జర్లాండ్ సర్కార్ నోటీసులు
ABN , First Publish Date - 2020-07-10T13:31:29+05:30 IST
కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్, ఆయన సతీమణి రేణుకల స్విస్ బ్యాంక్ ఖాతాలు, ఇతర ఆర్థిక వివరాలను భారత్కు ఎవరు తెలిపారనే దానిపై స్విట్జర్లాండ్ ప్రభుత్వం బహిరంగ నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ/బెర్న్, జూలై 9: కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్, ఆయన సతీమణి రేణుకల స్విస్ బ్యాంక్ ఖాతాలు, ఇతర ఆర్థిక వివరాలను భారత్కు ఎవరు తెలిపారనే దానిపై స్విట్జర్లాండ్ ప్రభుత్వం బహిరంగ నోటీసులు జారీ చేసింది. స్విస్ చట్టాలకు వ్యతిరేకంగా సమాచారం అందజేశారని పేర్కొంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బిష్ణోయ్ పది రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.