డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీకి ఘన నివాళి

ABN , First Publish Date - 2021-06-24T03:16:56+05:30 IST

భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌ ను పురస్కరించికుని బుధవారం క్లాత్‌మర్చంట్స్‌ కల్యాణమండపంలో ముఖర్జీ చిత్రపటానికి నేతలు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. వక్తలు మాట్లాడుతూ అఖండ భారతావని కోసం ప్రాణాలు అ

డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీకి ఘన నివాళి
1: శ్యాంప్రసాద్‌ముఖర్జీ చిత్ర పటానికి పూల మాల వేసి నివా

కావలిటౌన్‌, జూన్‌23: భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌ ను పురస్కరించికుని బుధవారం క్లాత్‌మర్చంట్స్‌ కల్యాణమండపంలో ముఖర్జీ చిత్రపటానికి నేతలు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. వక్తలు మాట్లాడుతూ అఖండ భారతావని కోసం ప్రాణాలు అర్పించిన భారతమాత ముద్దుబిడ్డ శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు.   కార్యక్రమంలో నాయకులు బ్రహ్మానందం, కంచర్ల మురళీ నాయుడు,  సుభాషిణి, వీవీ రంగారెడ్డి, సీవీసీ సత్యం, తదితరులు పాల్గొన్నారు. 

 సంగంలో..

సంగం, జూన్‌ 23:  సంగంలోని సత్రం సెంటర్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు జయశంకర్‌ అధ్వర్యంలో భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాకు విజయలక్ష్మి మాట్లాడుతూ దేశంలో జాతీయ భావజాలాన్ని పెంపొందించేందుకు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ స్థాపించారని తెలియజేశారు.  కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు మాల్యాద్రి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-24T03:16:56+05:30 IST