T20: టీమిండియాకు 165 పరుగుల లక్ష్యం విధించిన కివీస్

ABN , First Publish Date - 2021-11-18T02:24:01+05:30 IST

టీమిండియాతో ఇక్కడి సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న T20 టోర్నీ తొలి మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్ళు...

T20: టీమిండియాకు 165 పరుగుల లక్ష్యం విధించిన కివీస్

జైపూర్: టీమిండియాతో ఇక్కడి సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న T20 టోర్నీ తొలి మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్ళు 165 పరుగుల లక్ష్యాన్ని విధించారు. కివీస్ ఆటగాళ్ళలో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (70) పరుగులు, మార్క్ చాప్‌మేన్ (63) పరుగుల వ్యక్తిగత స్కోర్లతో అర్థ శతకాలు సాధించి టీమిండియాకు ఈ లక్ష్యాన్ని విధించడంలో కీలక పాత్ర పోషించారు. డారెల్ మిషెల్, గ్లెన్ ఫిలిప్స్ డకౌట్ కాగా శాంట్నర్ (4), కెప్టెన్ టిమ్ సౌథీ నాటౌట్‌గా నిలిచారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ 6 వికెట్లు కోల్పోయి 164 పరుగుల స్కోరు సాధించింది. టీమిండియా బౌలర్లు భువనేశ్వర్, అశ్విన్ చెరి 2 వికెట్లు, చాహర్, సిరాజ్ చెరొక వికెట్ పడగొట్టారు.

Updated Date - 2021-11-18T02:24:01+05:30 IST