విజేతకు రూ. 12 కోట్లు

ABN , First Publish Date - 2021-10-11T07:34:17+05:30 IST

టీ20 వరల్డ్‌ కప్‌ విజేతకు రూ. 12 కోట్లు ప్రైజ్‌మనీ దక్కనుంది. అలాగే రన్నరప్‌ జట్టుకు రూ. ఆరు కోట్లు అందజేయనున్నట్టు ఐసీసీ ఆదివారం ప్రకటించింది.

విజేతకు రూ. 12 కోట్లు

టీ20 వరల్డ్‌కప్‌ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ

దుబాయ్‌: టీ20 వరల్డ్‌ కప్‌ విజేతకు రూ. 12 కోట్లు ప్రైజ్‌మనీ దక్కనుంది. అలాగే రన్నరప్‌ జట్టుకు రూ. ఆరు కోట్లు అందజేయనున్నట్టు ఐసీసీ ఆదివారం ప్రకటించింది. యూఏఈ, ఒమన్‌ వేదికలుగా మెగా టోర్నీ ఈనెల 17నుంచి వచ్చేనెల 14 వరకు జరగనుంది. సెమీస్‌లో ఓడిన జట్లకు రూ. 3 కోట్లు చొప్పున లభిస్తాయి. సూపర్‌- 12 దశలో నిష్క్రమించే జట్లు రూ. 52.59 లక్షలు అందుకుంటాయి. ఇక తొలి రౌండ్‌లోనే తిరుగుముఖంపట్టే ఒక్కో జట్టుకు రూ. 30 లక్షలు ఇస్తారు. ఈ రౌండ్‌లో గెలిచే ప్రతి మ్యాచ్‌కు జట్టుకు రూ. 30 లక్షలు లభిస్తాయి. కాగా.. ఒక్కో ఇన్నింగ్స్‌లో రెండు డ్రింక్‌ విరామాలుంటాయి. అంపైర్‌ నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్‌ఎస్‌)ను పొట్టి ప్రపంచ కప్‌లో తొలిసారి ప్రవేశపెట్టనున్నారు. ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టుకు రెండు డీఆర్‌ఎస్‌ చాన్సులుంటాయి. అప్ఘానిస్థాన్‌ జట్టు వరల్డ్‌ కప్‌లో ఆడుతుందని ఐసీసీ వెల్లడించింది.  

Updated Date - 2021-10-11T07:34:17+05:30 IST