ఇకపై ఏం జరగొచ్చు..!
ABN , First Publish Date - 2021-10-27T07:26:45+05:30 IST
గ్రూప్-2లో మంగళవారం జరిగిన కీలక మ్యాచ్లో పాకిస్థాన్...న్యూజిలాండ్ను ఓడించింది. ఈ గ్రూప్లో ఉన్న మూడో ....
కివీస్పై పాక్ గెలిచింది కాబట్టి...
మ్యాచ్ నుంచి వైదొలగి సంచలనం
గ్రూప్-2లో మంగళవారం జరిగిన కీలక మ్యాచ్లో పాకిస్థాన్...న్యూజిలాండ్ను ఓడించింది. ఈ గ్రూప్లో ఉన్న మూడో పెద్ద జట్టు భారత్. ఈ మూడు పెద్ద జట్లూ ఎటువంటి సంచలనాలు లేకుండా ఇదే గ్రూపులోని చిన్న జట్లయిన అఫ్ఘానిస్థాన్, నమీబియా, స్కాట్లాండ్లను ఓడిస్తాయనుకుంటే...భారత్ సెమీస్కు వెళ్లే అవకాశాలు ఎలా ఉండవచ్చో పరిశీలిద్దాం.
అవకాశం1: ఈనెల 31న జరిగే మ్యాచ్లో భారత జట్టు న్యూజిలాండ్పై గెలిస్తే.. భారత్ 8, పాక్ 10 పాయింట్లతో సెమీస్ కు చేరుతాయి. కివీస్ 6 పాయింట్లతో ఇంటికి వెళ్తుంది.
అవకాశం2: ఒకవేళ భారత జట్టు కివీస్ చేతిలో ఓడితే.. పాక్ 10, కివీస్ 8 పాయింట్లతో సెమీస్ కు చేరుతాయి. భారత్ 6పాయింట్లతో నిష్క్రమిస్తుంది.
గమనిక: మూడు పెద్ద జట్లు... మూడు చిన్న జట్లను ఓడిస్తేనే ఈ విశ్లేషణ సాధ్యం.