అంబేద్కర్ నగర్లో తాగునీటి కష్టాలు
ABN , First Publish Date - 2022-01-28T02:53:37+05:30 IST
కావలి బుడంగుంట అంబేద్కర్నగర్లో పనిచేయని చేతిపంపులతో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కూలీనాలీ
పట్టించుకోని అధికారులు
కావలి రూరల్, జనవరి27: కావలి బుడంగుంట అంబేద్కర్నగర్లో పనిచేయని చేతిపంపులతో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కూలీనాలీ చేసుకుం టూ కాలనీలో సుమారు 40 కుటుంబాల వారు నివసి స్తున్నారు. కాలనీలో నాలుగు చేతిపంపులు మినహా ఎ లాంటి తాగునీటి వనరులు లేవు. చేతిపంపులన్నీ మరమ్మతులకు గురై, నెలలు గడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. అరకొరగా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా జరుగుతుందని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీవాసులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.