అంబరాన్నంటిన 'టాకో' సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2020-02-10T15:47:33+05:30 IST

సెంట్రల్ ఒహియో తెలుగు సంఘం(టాకో) వారు ఫిబ్రవరి 8న వెస్తెర్విల్లె నార్త్ హై స్కూల్‌లో సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

అంబరాన్నంటిన 'టాకో' సంక్రాంతి సంబరాలు

ఒహియో: సెంట్రల్ ఒహియో తెలుగు సంఘం(టాకో) వారు ఫిబ్రవరి 8న వెస్తెర్విల్లె నార్త్  హై స్కూల్‌లో సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను టాకో అధ్యక్షులు జగన్నాథ్ చలసాని జ్యోతి ప్రజ్వలనతో ఆరంభించారు. నీలిమ యలమంచలి నాయకత్వంలో 2020 కమిటీ సభ్యులు కాళీ ప్రసాద్ మావులేటి, సుధీర్ కనగాల, అపర్ణ కోనంకి, ఉష శాఖమూరు, శివ చావా, రాజ్ వంటిపల్లి, సంపత్ నాలం, విజయ్ కాకర్ల, అనిల్ బ్యాడిగెర, వేణు అబ్బూరి, రామ్ సానేపల్లి, వినోద్ యడ్లపల్లి, సత్య మర్రే, ప్రదీప్ గుంటక, శ్రీదిత్య అట్లూరి, ప్రవీణ్ కుమార్ అంకం, రాజేష్ చెరుకూరి, భాను పొట్లూరి, శ్రీవర్షిణి ముద్దులూరు, తేజశ్వని కంచరపల్లి, ప్రదీప్ చందనం, జయ మేడేది, విక్రమ్ రాచర్ల, కీర్తి కౌశిక్ తరణి, అన్వేష్ పెండ్యాల, ఊహ కాట్రగడ్డ, రమ ప్రత్తిపాటి, చిరంజీవి సమ్మెట సహాయ సహకారాలతో కన్నుల పండువగా సంక్రాంతి కార్యక్రమాలు జరిగాయి.


ఈ కార్యక్రమానికి అసోసియేట్  జస్టిస్, సుప్రీం కోర్టు ఒహియో పాట్రిక్ డివైన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వేడుకలో భాగంగా ప్రముఖ దంత వైద్యురాలు అపర్ణ సాదినేని గారిని ఘనంగా సత్కరించారు. చల్లటి శీతాకాలంలో చక్కటి కార్యక్రమాలని చూడటానికి 1200 మందికి పైగా కొలంబస్ ప్రజలు తరలివచ్చారు. 40పైగా కార్యక్రమాలు , 400పైగా పిన్నలు పెద్దలు పాల్గొన్నారు. ఆకాశ వీధిలో అందాల జాబిలి(మహానటి సావిత్రి గారి నివాళి), సఖి ఫ్యాషన్స్ వారి ఫ్యాషన్ షో, ప్రముఖ బుల్లితెర నటీమణి, కూచిపూడి నర్తకి జ్యోతి రెడ్డి "శ్రీ శ్రీనివాస కళ్యాణం" కూచిపూడి నాట్యం, వాలెంటైన్ డే స్పెషల్ అరవింద్ మేజిక్ షో, దీపక్ భార్గవ్ హాస్యనాటిక "అల ఆఫీసులో" మొదలైన ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. సూపర్ సింగర్  గాయని గాయకులైన హనుమాన్, స్వాతి తమ పాటలతో శ్రోతలను అలరించారు.


సంక్రాంతి వేడుకల సందర్భంగా టాకో వారు పిల్లలకి  "మేజిక్ " పోటీలు, "మహానటి సావిత్రి" గారి నటనను అనుకరించుటకు "టిక్  టాక్" పోటీ  నిర్వహిoచారు. సావిత్రి గారి నటనతో పిల్లలు, పెద్దలు అనేక "టిక్  టాక్" వీడియోలు చేసి పంపించడం విశేషం. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి టాకో ట్రస్టీలు శ్రీలత రేవూరు, జ్యోతి దండు, ఫణి భూషణ్ పొట్లూరి, కోటి బోడెపూడి, సుబ్బారెడ్డి  కోవూరు బహుమతులు ప్రధానం చేశారు. ఈ వేడుకలకు వచ్చిన వారి కోసం రుచికరమైన చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు. చివరగా వందేమాతరం గీతలాపనతో(45 మంది పైగా పిల్లలు పాడటం విశేషం) సంక్రాంతి సంబరాలు ముగిశాయి.


Updated Date - 2020-02-10T15:47:33+05:30 IST