తడ పీహెచ్సీ తనిఖీ
ABN , First Publish Date - 2021-10-21T03:19:36+05:30 IST
తడ పీహెచ్సీలో కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన జాతీయ నాణ్యతా ప్రమాణాల బృందం తనిఖీలు నిర్వహించింది. బుధవారం డాక్టర్ నిషా
తడ, అక్టోబరు 20 : తడ పీహెచ్సీలో కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన జాతీయ నాణ్యతా ప్రమాణాల బృందం తనిఖీలు నిర్వహించింది. బుధవారం డాక్టర్ నిషాశ్రీకుమరన్, డాక్టర్ విజయకుమార్లతో కూడిన బృందం నాణ్యతాప్రమాణాలు, ఆసుపత్రి నిర్వహణ, వసతుల కల్పన, రోగులకు అందించే సేవలు వంటి విషయాలపై పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. పలువురు రోగులతో మాట్లాడారు. బుధ, గురువారాలలో రెండు రోజులపాటు ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అనంతరం పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని వారు తెలిపారు. వారి వెంట సీహెచ్సీ డాక్టర్ మురళీధర్, దేదీప్యా తదితరులు ఉన్నారు.