పోలీస్ స్టేషన్‌కు తాడేపల్లి బాధితురాలు

ABN , First Publish Date - 2021-06-25T21:29:17+05:30 IST

తాడేపల్లి అత్యాచార బాధితురాలిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి వివరాలు సేకరిస్తున్నారు.

పోలీస్ స్టేషన్‌కు తాడేపల్లి బాధితురాలు

గుంటూరు జిల్లా: తాడేపల్లి అత్యాచార బాధితురాలిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి వివరాలు సేకరిస్తున్నారు. బాధితురాలి మానసిక పరిస్థితి స్థిరంగా ఉందని అందుకే తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా, తాడేపల్లి పీఎస్ పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద కాబోయే భర్తతో వచ్చిన ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి సెల్ ఫోన్లు పట్టుకుపోయారు.


సీతానగరానికి చెందిన కృష్ణ, వెంకటరెడ్డి వారిపై దాడి చేసి, అత్యాచారం చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. దాడి జరిగిన తర్వాత ఇద్దరు పడవలో విజయవాడ వైపు వెళ్లి అక్కడి నుంచి రైల్వే ట్రాక్ మీదుగా తాడేపల్లి వైపు వచ్చి పాడుబడ్డ భవనంలో ఉన్నారని గుర్తించారు. తర్వాత గోపి, నరేష్ అనే స్నేహితులతో కలిసి దాడిలో దోచుకున్న సెల్ ఫోన్లు, బంగారు చెవిపోగులు ఓ వ్యాపారి వద్ద తాకట్టుపెట్టారు. ఆ వ్యాపారి వాటిని మరొకరికి విక్రయించాడు. అయితే విచారణలో భాగంగా ఆ వ్యాపారులు ఇద్దరిని పోలీసులు గుర్తించి సెల్ ఫోన్లు, చెవి పోగులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కృష్ణ తల్లి సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.

Updated Date - 2021-06-25T21:29:17+05:30 IST