టైలర్ హత్య కేసులో తాజా అప్డేట్ ఇదీ...
ABN , First Publish Date - 2021-04-06T14:16:39+05:30 IST
సిద్ధిఖీ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో
హైదరాబాద్/బంజారాహిల్స్ : టైలర్ హత్య కేసులో భార్యతోపాటు ఆమె ప్రియుడిని ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు. వారిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. యూసుఫ్గూడ సమీపంలోని ఎస్పీఆర్హిల్స్లో ఉండే సిద్ధిఖీ అహ్మద్ టైలర్. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మార్చి 31న అతను దారుణ హత్యకు గురయ్యాడు. సిద్ధిఖీ అహ్మద్ భార్యతో శ్రీరామ్ నగర్లో నివసించే మెకానిక్ సయ్యద్ అలీకి వివాహేత సంబంధం ఏర్పడింది. ఈ విషయం సిద్ధిఖీకి తెలియడంతో అతడి అడ్డు తొలగించుకోవాలని అలీ పథకం వేశాడు. మొదట ఆమె ఒప్పుకోకపోయినా, తర్వాత ఒప్పుకుంది. దీంతో సిద్ధిఖీ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అలీ దారుణంగా చంపేశాడు. విషయాన్ని సిద్ధిఖీ భార్యకు వాట్సాప్ కాల్ చేసి చెప్పాడు. సీసీ పుటేజీల ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు విచారించగా, సిద్ధిఖీ భార్య పాత్ర వెలుగులోకి వచ్చింది. నిందితులను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.