బోగస్ గిరిజనులపై చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2020-08-12T10:24:03+05:30 IST
రిజర్వేషన్ అనుభవిస్తున్న బోగస్ గిరిజనులపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అడ్డూరి ..
దాసన్నపేట, ఆగస్టు 11 : రిజర్వేషన్ అనుభవిస్తున్న బోగస్ గిరిజనులపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అడ్డూరి పైడితల్లి దొర డిమాండ్ చేశారు. మంగళవారం రింగురోడ్డు సమీపంలోని గిరిజనభవన్లో గిరిజన ఉద్యోగుల సంఘ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన భవనాలను అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఔట్సోర్సింగ్ విధానంలో గిరిజనులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గిరిజన సంఘాల ప్రతినిధులు బంగారు దొర, పాడి రమేష్, ఆలుగు వెంకటరావు, దాసరి ఈశ్వర రావు, లోవరాజు, అప్పలరాజు దొర తదితరులు పాల్గొన్నారు.