ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి : బీజేపీ
ABN , First Publish Date - 2021-07-29T06:25:31+05:30 IST
గోరక్షణ చట్టంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై చర్య లు తీసుకోవాలని తహశీల్దార్ శ్రీనివాసులుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు బుధవారం వినతి పత్రం అందజేశారు.
కూడేరు, జూలై 28 : గోరక్షణ చట్టంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై చర్య లు తీసుకోవాలని తహశీల్దార్ శ్రీనివాసులుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు బుధవారం వినతి పత్రం అందజేశారు. ముందుగా ఆయన స్థానిక బీజే పీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, మండల అధ్యక్షులు ఆంజనేయులు, బీజేవైఎం అధ్యక్షుడు భరత్, నాయకులు రామాంజనేయులు, మల్లేశ్వరీ, భారతి పాల్గొన్నారు.