స్ర్కాప్‌ దొంగలపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-10-18T05:38:04+05:30 IST

రామగుండం పాత మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న స్ర్కాప్‌ దొంగిలించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్‌కు వైఎస్‌ఆర్‌టీపీ పెద్దపల్లి పార్లమెంట్‌ కన్వీనర్‌ జిమ్మిబాబు ఫిర్యాదు చేశారు.

స్ర్కాప్‌ దొంగలపై చర్యలు తీసుకోండి
సీఐకి ఫిర్యాదు పత్రం అందజేస్తున్న వైఎస్‌ఆర్‌టీపీ నాయకులు

కోల్‌సిటీ, అక్టోబరు 17: రామగుండం పాత మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న స్ర్కాప్‌ దొంగిలించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్‌కు వైఎస్‌ఆర్‌టీపీ పెద్దపల్లి పార్లమెంట్‌ కన్వీనర్‌ జిమ్మిబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత ము న్సిపల్‌ కార్యాలయంలో రూ.70లక్షల విలువైన స్ర్కాప్‌ దొంగతనం జరిగి నెలరోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇందులో కొంత మంది ప్రజాప్రతినిధుల ప్రమేయం కూడా ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ పట్టిం చుకోవడం లేదన్నారు. కేవలం రూ.58 వేల స్ర్కాప్‌ పోయిందని కమిషనర్‌ ఫిర్యాదు చేయడం హస్యాస్పదంగా ఉందని, రూ.70లక్షల స్ర్కాప్‌ మాయమైతే ఇప్పటివరకు కమిషనర్‌ ఎందుకు సరిగా స్పందించడం లేదని, ప్రజాధనం వృధా అవుతున్నా చూ సీచూడనట్టు వ్యవహరిస్తున్నారని, ఓ ప్రజాప్రతినిధి భర్తకు ఇందులో ప్రమేయం ఉందని తెలిసినప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టడం లేని ఆయన ప్రశ్నించారు. దీని పై త్వరలోనే రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదులో చేసిన వారిలో నాయకులు ఓఎల్‌రెడ్డి, శ్యామ్‌సన్‌, రాజ్‌, ద బ్బెట మహేందర్‌, బూడిద బానేష్‌, వెంకటేష్‌, మహేందర్‌ ఉన్నారు. 

Updated Date - 2021-10-18T05:38:04+05:30 IST