భూ ఆక్రమణపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-06-14T05:13:23+05:30 IST

మండలంలోని కొంత మంది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొంటున్నారని రాయచోటి నియోజకవర్గ సీపీఐ ఏరియా కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు పేర్కొన్నారు.

భూ ఆక్రమణపై చర్యలు తీసుకోండి

లక్కిరెడ్డిపల్లె, జూన్‌13: మండలంలోని  కొంత మంది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొంటున్నారని రాయచోటి నియోజకవర్గ సీపీఐ ఏరియా కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం సబ్‌స్టేషన్‌ వద్ద ఉన్న స్థలాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్కిరెడ్డిపల్లె గ్రామ పరిధిలోని ప్రభుత్వ డీకేటీ భూములను బినామీల పేర్లతో చాలా మంది ఆక్రమించుకున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. మండలంలోని వందల ఎకరాలను ప్రభుత్వ స్థలాలు ఎవరి కొద్ది వారు ఆక్రమించుకున్నారని, అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. లక్కిరెడ్డిపల్లె గ్రామ పరిధిలో భూములను చాలా మంది నిరుపేదలు ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇళ్ల స్థలాలను పేదలకు పంచిపెట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీయం నాయకులు గణేష్‌, సహదేవ, ఓబులేసు, ఏఐటీయూసీ ఏరియా నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-14T05:13:23+05:30 IST