శ్మశానాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-01-18T03:55:46+05:30 IST
స్థానిక దర్గా సమీపంలోని ముస్లింల శ్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు తీసుకోలని ముస్లిం కమిటీ నాయకులు కోరారు.
గూడూరు, జనవరి 17: స్థానిక దర్గా సమీపంలోని ముస్లింల శ్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు తీసుకోలని ముస్లిం కమిటీ నాయకులు కోరారు. సోమవారం స్థానిక ముస్లిం కార్యాలయంలో కమిషనర్ శ్రీకాంత్కు ముస్లిం కమిటీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చెట్లు ఏపుగా పెరిగిపోవడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి శ్మశానవాటికలో వసతులను మెరుగుపరచాలన్నారు. కార్యక్రమంలో హసీం, నజీర్, కబీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రెండు డోసులు టీకా పూర్తి చేసుకున్నవారికి క్రమపద్ధతిలో బూస్టర్ డోసులు వేస్తున్నామన్నారు.