అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-08T04:55:17+05:30 IST

విద్యా ర్థులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవా లని పీయూ వీసీ ప్రొఫెసర్‌ ఎల్‌.బి.లక్ష్మికాంత్‌రాథోడ్‌ అన్నారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
వాలీబాల్‌ ఎంపికకు వచ్చిన క్రీడాకారులతో మాట్లాడుతున్న లక్ష్మికాంత్‌రాథోడ్‌

- పీయూ వీసీ ప్రొఫెసర్‌ ఎల్‌బీ.లక్ష్మికాంత్‌ రాథోడ్‌

- వాలీబాల్‌ జట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం 


పాలమూరు యూనివర్సిటీ, డిసెంబరు 7 : విద్యా ర్థులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవా లని పీయూ వీసీ ప్రొఫెసర్‌ ఎల్‌.బి.లక్ష్మికాంత్‌రాథోడ్‌ అన్నారు. మంగళవారం పీయూ క్రీడా మైదానంలో  తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో జరిగే సౌత్‌జోన్‌ గేమ్స్‌ పోటీల్లో పాల్గొనేందుకు మహిళల, పురుషుల పీయూ వాలీబాల్‌ జట్ల ఎంపిక ప్రక్రియను పీయూ పీడీ బాల్‌రాజ్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారం  భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వా లీబాల్‌ జట్ల ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి మ హిళా క్రీడాకారులు 40 మంది, పురుషులు 50 మంది హాజరయ్యారు. ఇందులో మహిళా జట్టుకు 18 మంది, పురుషుల జట్టుకు 18 మందిని ఎంపిక చేశారు. ఎం పిక ప్రక్రియలో రిటైర్డ్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ చెన్నవీరయ్య, పీడీలు శ్రీనువాస్‌రెడ్డి, కవిత, శ్వేత, లక్ష్మి, వాలీబాల్‌ కోచ్‌ శివ, పీఈటీ సుచేతన్‌రెడ్డి, పర్వేష్‌పాషా ఉన్నారు. 

Updated Date - 2021-12-08T04:55:17+05:30 IST