పాదాలను పట్టించుకోండి..

ABN , First Publish Date - 2021-06-14T15:27:00+05:30 IST

వర్షాకాలంలో పాదాల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సీజన్‌లో పాదాలు ఎక్కువ సమయం తడిగా ఉంటే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

పాదాలను పట్టించుకోండి..

ఆంధ్రజ్యోతి(14-06-2021)

వర్షాకాలంలో పాదాల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సీజన్‌లో పాదాలు ఎక్కువ సమయం తడిగా ఉంటే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.


పాదాలు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. వర్షంలో తడిసినప్పుడు షూ, సాక్స్‌తో అలాగే ఉంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 

వారంలో ఒకసారి పాదాలను ఉప్పు వేసిన గోరు వెచ్చని నీటిలో పావుగంటపాటు పెట్టాలి. ఇలా చేయడం  వల్ల బ్యాక్టీరియా చనిపోవడమే కాకుండా, పాదాలు మృదువుగా తయారవుతాయి. గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా నిమ్మరసం వేసి కూడా ఉపయోగించవచ్చు. 

రాత్రి పడుకునే ముందు పాదాలకు మాయిశ్చర్‌ అప్లై చేసుకోవడం మరువద్దు. మురికి పేరుకుపోకుండా ఉండాలంటే గోళ్లు చిన్నగా కత్తిరించుకోవాలి. చెప్పులు లేకుండా బయటకుపోకూడదు. తడిగా ఉన్న చోట తప్పనిసరిగా చెప్పులు వాడాలి.

పాదాలకు బొప్పాయి గుజ్జు రాసుకోవడం వల్ల మృదువుగా మారతాయి. పాదాలకు పగుళ్లు ఉన్నట్లయితే హెన్నా పేస్టు రాసుకుని ఆరిన తరువాత కడిగేసుకోవాలి.


Updated Date - 2021-06-14T15:27:00+05:30 IST