ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2022-01-25T04:33:56+05:30 IST
సమస్యలపై ప్రజలు ఇచ్చే అర్జీలకు తక్షణ పరిష్కారం చూపాలని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన
కడప(క్రైం), జనవరి 24: సమస్యలపై ప్రజలు ఇచ్చే అర్జీలకు తక్షణ పరిష్కారం చూపాలని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఫిర్యాదుదారులతో మాట్లాడారు. ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఫిర్యాదుదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత సమయంలో విచారించి పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఫిర్యాదుదారులకు మరింత చేరువయ్యేందుకు ఫిర్యాదులను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల పరిఽధిలోని పోలీసు అధికారుల అందించాలని, వారు విచారించి న్యాయం చేస్తారని తెలిపారు.