కొవిడ్‌ నివారణ చర్యలుపటిష్ఠంగా చేపట్టండి: డీఈవో

ABN , First Publish Date - 2021-04-17T06:14:32+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో కొవిడ్‌ నిబంధనలు తప్ప కుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీఈవో నరసింహారెడ్డి అధికారులను ఆదేశించారు.

కొవిడ్‌ నివారణ చర్యలుపటిష్ఠంగా చేపట్టండి: డీఈవో
బి.కొత్తకోట ఆదర్శ పాఠశాలలో రికార్డులు తనిఖీ చేస్తున్న డీఈవో నరసింహారెడ్డి

బి.కొత్తకోట, ఏప్రిల్‌ 16: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో కొవిడ్‌  నిబంధనలు తప్ప కుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీఈవో నరసింహారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బి.కొత్తకోటలోని ఎమ్మార్సీ కార్యాలయం, ఆదర్శ పాఠశాల బాలికల వసతిగృహం, అలాగే కస్తూర్బా విద్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. ప్రతి విద్యా సంస్థలో విద్యార్థులు మాస్కులు ధరించి, శానిటైజర్‌ వాడేలా చూడాలని, అలాగే భౌతికదూరం పాటించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో రికార్డులు తనిఖీ చేసి నాడు-నేడు పనులను పరిశీలించారు. ఎంఈవో రెడ్డిశేఖర్‌, ప్రిన్సిపాల్‌ శ్రీను నాయక్‌, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-17T06:14:32+05:30 IST