కమ్యూనిటీహాళ్లను స్వాధీనం చేసుకుంటాం: తలసాని
ABN , First Publish Date - 2020-08-15T09:22:52+05:30 IST
ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు, బస్తీ సంఘాల అధీనంలో ఉన్న జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాళ్లను స్వాధీనం
రాంనగర్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు, బస్తీ సంఘాల అధీనంలో ఉన్న జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాళ్లను స్వాధీనం చేసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ తెలిపారు. శుక్రవారం అడిక్మెట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాంనగర్, అడిక్మెట్, ముషీరాబాద్, భోలక్పూర్, కవాడిగూడ డివిజన్లలో జీహెచ్ఎంసీకి చెందిన కమ్యూనిటీహాల్స్ కొందరు వ్యక్తులు, సంస్థల చేతుల్లో ఉన్నాయన్నారు. వాటిని స్వాధీనం చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.