వామ్మో తెలంగాణలో ఇన్ని కేసులా.. ఈ ఒక్కరోజే..

ABN , First Publish Date - 2020-06-07T03:04:53+05:30 IST

తెలంగాణలో శనివారం 206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 10 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ 3,496 కరోనా పాజిటివ్ నిర్ధారణ ..

వామ్మో తెలంగాణలో ఇన్ని కేసులా.. ఈ ఒక్కరోజే..

హైదరాబాద్: తెలంగాణలో శనివారం 206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 10 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ 3,496 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 152 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో 123 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం 1,710 మంది డిశ్చార్జ్‌ కాగా 1,663 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రంగారెడ్డి 10, మేడ్చల్‌ 18, నిర్మల్‌ 5, యాదాద్రి 5, మహబూబ్‌నగర్‌లో 4 కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు జగిత్యాల, నాగర్‌కర్నూల్‌లో రెండేసి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మహబూబాబాద్‌, వికారాబాద్‌, జనగాం, గద్వాల, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్‌, మంచిర్యాలలో ఒక్కో కరోనా కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 





Updated Date - 2020-06-07T03:04:53+05:30 IST