తలసాని శ్రీనివాసయాదవ్పై జగ్గారెడ్డి ఫైర్
ABN , First Publish Date - 2020-07-10T01:25:40+05:30 IST
మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్కు తలసాని చెంచాగిరి చేసింది చాలని హెచ్చరించారు.
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్కు తలసాని చెంచాగిరి చేసింది చాలని హెచ్చరించారు. తలసాని పహిల్వాన్ గిరి బంద్ చెయ్ అని వార్నింగ్ చేశారు. తలసాని ప్రజల కోసం కాదని, కేసీఆర్ కుటుంబం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చి దమ్ము నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తన నిషాని కోసమే కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మిస్తున్నారని జగ్గారెడ్డి దుయ్యబట్టారు.