ఇకపై తాలిబన్ యాంకర్లకే టీవీ వార్తలు చదివే అవకాశం!
ABN , First Publish Date - 2021-08-18T15:48:49+05:30 IST
అఫ్ఘానిస్తాన్ను ఆక్రమించిన తాలిబన్లు అక్కడి...
కాబుల్: అఫ్ఘానిస్తాన్ను ఆక్రమించిన తాలిబన్లు అక్కడి మహిళా యాంకర్లపై నిషేధం విధించారు. ప్రభుత్వ న్యూస్ ఛానళ్లలో పనిచేస్తున్న మహిళా న్యూస్ యాంకర్లను తొలగించారు. ఇకపై తాలిబన్ యాంకర్లు మాత్రమే టీవీ న్యూస్ చదవనున్నారు. ప్రభుత్వ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న ఖదీజా అమీన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇకపై కేవలం షరీయత్ చట్ట ప్రకారమే మహిళలు పనిచేయాల్సివుంటుందని తాలిబన్ నేతలు తెలిపారు. ఉద్యోగం కోల్పోయిన ఖదీజా అమీన్ మాట్లాడుతూ ‘ఇకపై నేను ఏం చేయాలి? రాబోయే తరాలకు పని ఉండదు. గడచిన 20 ఏళ్లలో మేము సాధించినదంతా వృథా అయిపోయింది. తాలిబన్లు తాలిబన్లే... వారిక మారరు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.