పంజ్‌షీర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాం: తాలిబన్ ప్రకటన

ABN , First Publish Date - 2021-09-04T12:47:56+05:30 IST

అఫ్ఘానిస్తాన్‌లోని పంజ్‌షీర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని...

పంజ్‌షీర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాం: తాలిబన్ ప్రకటన

కాబుల్: అఫ్ఘానిస్తాన్‌లోని పంజ్‌షీర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. దీంతో ఆప్ఘనిస్తాన్‌ అంతటినీ తమ ఆధీనంతోకి తెచ్చుకున్నట్లయ్యిందని తాలిబన్‌ కమాండర్‌ తెలిపారు. తిరుగుబాటుదారులు తమ చేతుల్లో ఓడిపోయారని పేర్కొన్నారు. అఫ్ఘానిస్తాన్ అంతటినీ స్వాధీనం చేసుకున్న నేపధ్యంతో తాలిబన్లు వేడుకలు చేసుకున్నారు. దీనికిముందు భారత్‌లోని కాశ్మీర్‌తో సహా ప్రపంచంలోని ముస్లింలందరి తరపునా మాట్లాడే హక్కు తమకు వుందని తాలిబన్‌ నాయకులు తెలిపారు. అయితే ఏ దేశానికీ వ్యతిరేకంగా సాయుధ కార్యకలాపాలు చేపట్టబోమన్నారు. కాగా తాలిబన్లు అఫ్ఘానిస్తాన్‌ను తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తారని భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 


Updated Date - 2021-09-04T12:47:56+05:30 IST