ఇది తాలిబన్ రాజ్యం కాదు కదా..?: రేవంత్
ABN , First Publish Date - 2021-10-02T22:38:03+05:30 IST
తెలంగాణ ప్రభుత్వాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. ‘‘అలాంటి తెలంగాణలో ఇంత నిర్బంధం ఏంటి? ఇది తాలిబన్ రాజ్యం కాదు కదా..? అమరుడికి నివాళులు అర్పిస్తామంటే నొప్పేంటి. శ్రీకాంతాచారి కసబ్ కాదు కదా?’’ అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. తాను వెళ్లడానికి ఎస్కార్ట్ ఇవ్వాలని, ఇంటి దగ్గర రోడ్డుపై బైఠాయించి రేవంత్ నిరసన తెలుపుతున్నారు.
రేవంత్రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జంగ్ సైరన్కు వెళ్లకుండా ఇంటి దగ్గరే రేవంత్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో రేవంత్రెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.