మునిసిపల్‌ రెండో వైస్‌ చైర్మన్‌గా తమరాన నాయుడు ఖరారు

ABN , First Publish Date - 2021-07-30T05:57:35+05:30 IST

మునిసిపాలిటీ రెండో వైస్‌ చైర్మన్‌గా పెదబొడ్డేపల్లి 13వ వార్డు కౌన్సిలర్‌ తమరాన నాయుడును ఎమ్మెల్యే ఎంపిక చేశారు.

మునిసిపల్‌ రెండో వైస్‌ చైర్మన్‌గా తమరాన నాయుడు ఖరారు
తమరాన నాయుడు

నర్సీపట్నం, జూలై 29 : మునిసిపాలిటీ రెండో వైస్‌ చైర్మన్‌గా పెదబొడ్డేపల్లి 13వ వార్డు కౌన్సిలర్‌ తమరాన నాయుడును ఎమ్మెల్యే ఎంపిక చేశారు. శుక్రవారం జరగనున్న మునిసిపల్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. గత టీడీపీ పాలకవర్గంలో ఫ్లోర్‌ లీడర్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. బలిఘట్టం ప్రాంతానికి చెందిన ఆదిలక్ష్మి చైర్‌ పర్సన్‌గా, నర్సీపట్నానికి చెందిన గొలుసు నర్సింహమూర్తి వైస్‌ చైర్మన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండో వైస్‌ చైర్మన్‌ పదవి పెదబొడ్డేపల్లి నుంచి రెండు పర్యాయాలుగా కౌన్సిలర్‌గా ప్రాతినిఽథ్యం వహిస్తున్న తమరాన పేరు పరిశీలనలోకి వచ్చింది. ఈ పదవికి పెదబొడ్డేపల్లికి చెందిన కౌన్సిలర్‌ను ఎంపిక చేస్తే మూడు ప్రాంతాలకు సమన్యాయం చేసినట్టు ఉంటుందని పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సం దర్భంగా తమరాన ‘ఆంధ్రజ్యోతి’లో మాట్లాడుతూ   రెండో వైస్‌ చైర్మన్‌ పదవికి తనను ఎంపిక చేసిన ఎమ్మెల్యే గణేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-07-30T05:57:35+05:30 IST