వచ్చే ఆదివారం పూర్తి లాక్‌డౌన్ : స్టాలిన్

ABN , First Publish Date - 2022-01-21T22:20:23+05:30 IST

కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంపై తమిళనాడు ప్రభుత్తం..

వచ్చే ఆదివారం పూర్తి లాక్‌డౌన్ : స్టాలిన్

చెన్నై: కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంపై తమిళనాడు ప్రభుత్తం అప్రమత్తమైంది. ఈనెల 23వ తేదీ ఆదివారంనాడు రాష్ట్రవ్యాప్తంగా పూర్తి లౌక్‌డౌన్‌ను ప్రకటించింది. పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారంనాడు ప్రకటించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, విమానాశ్రయాలకు, బస్, రైల్వేస్టేషన్లకు ప్రయాణికులను తీసుకువెళ్లే ఆటోలు, టాక్సీలను మాత్రం అనుమతిస్తారు. తమిళనాడులో గురువారం ఒక్కరోజు 28,561 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 30,43,796కు చేరింది.

Updated Date - 2022-01-21T22:20:23+05:30 IST