కరోనా కేసుల్లో ఢిల్లీని దాటిన తమిళనాడు

ABN , First Publish Date - 2020-07-01T16:09:19+05:30 IST

కరోనా కేసుల్లో తమిళనాడు ఢిల్లీని దాటేసింది.

కరోనా కేసుల్లో ఢిల్లీని దాటిన తమిళనాడు

న్యూఢిల్లీ: కరోనా కేసుల్లో తమిళనాడు ఢిల్లీని దాటేసింది. వైరస్ తీవ్రత దృష్ట్యా మహారాష్ట్రలోని ఠాణెలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. సోమవారం 19,459 మందికి కోవిడ్ సోకగా.. మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 18,522 మందికి పాజటీవ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. దీని ప్రకారం క్రితం రోజుతో పోలిస్తే బాధితుల సంఖ్య 937 తగ్గింది. మంగళవారం 418 మంది మృతి చెందారు. మరణాలు సోమవారం కంటే 38 ఎక్కువగా నమోదు అయ్యాయి. వైరస్‌తో దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక అల్లాడుతున్నాయి. ఒక్క రోజే 3,943 వరకు కేసుల నమోదుతో మొత్తం కేసుల్లో తమిళనాడు దేశ రాజధాని ఢిల్లీని దాటేసి రెండో స్థానానికి వచ్చింది. అత్యధికంగా 947 మందికి పాజిటీవ్ అని తేలడంతో కర్ణాటక, హరియాణ, ఏపీలను దాటేసింది.

Updated Date - 2020-07-01T16:09:19+05:30 IST