‘తమిళ్ తాయ్ వాళ్‌తు’ ఇక రాష్ట్ర గీతం... వినిపించినపుడు నిల్చోవడం తప్పనిసరి...

ABN , First Publish Date - 2021-12-17T20:18:35+05:30 IST

తమిళ తల్లిని కీర్తిస్తూ రాసిన ‘తమిళ్ థాయ్ వాళ్‌తు’ను రాష్ట్ర గీతంగా

‘తమిళ్ తాయ్ వాళ్‌తు’ ఇక రాష్ట్ర గీతం... వినిపించినపుడు నిల్చోవడం తప్పనిసరి...

చెన్నై : తమిళ తల్లిని కీర్తిస్తూ రాసిన ‘తమిళ్ తాయ్ వాళ్‌తు’ను రాష్ట్ర గీతంగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ గీతాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జరిగే అన్ని సార్వజనిక కార్యక్రమాల్లోనూ ఆలపించాలని, ఆలపించే సమయంలో అందరూ నిల్చొని, గౌరవాన్ని ప్రదర్శించాలని తెలిపింది. అయితే శారీరక లోపాలుగలవారు నిలబడవలసిన అవసరం లేదని తెలిపింది. 


మద్రాస్ హైకోర్టు ఇటీవల ఓ కేసులో తీర్పు చెప్తూ, ఇది కేవలం ప్రార్థన పాట అని తెలిపింది. సార్వజనిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఈ పాట పాడేటపుడు నిల్చోవాలని తెలిపే కార్యనిర్వాహక ఆదేశాలేవీ లేవని తెలిపింది. 


మరోవైపు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ ఈ ఏడాది స్నాతకోత్సవాల సందర్భంగా ఈ పాటను పాడించలేదు. దీంతో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి ఐఐటీకి ఓ లేఖ రాశారు. 


జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలని భారత రాజ్యాంగంలోని అధికరణ 51ఏ(ఏ) చెప్తోంది. 

Updated Date - 2021-12-17T20:18:35+05:30 IST