గోవాలో తయారైన ఆధునిక నౌక కన్నియాకుమారి రాక
ABN , First Publish Date - 2020-05-31T16:00:25+05:30 IST
గోవాలో తయారైన ఆధునిక నౌక కన్నియాకుమారి రాక
చెన్నై: పుంపుహార్ నౌకాయాన సంస్థ రూ.4 కోట్లతో గోవాలో తయారైన ఏసీ వసతితో కూడిన నౌక శనివారం కన్నియాకుమారి చేరుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్రప్రభుత్వ పూంపుహార్ నౌకాయాన సంస్థ రూ.8.25 కోట్ల వ్యయంతో ఎంఎల్ తామిరభరణి, ఎంఎల్ తిరువళ్లువర్ పేరిట రెండు ఆధునిక నౌక తయారీకి గోవాకు చెందిన సంస్థకు ఆర్డర్లు ఇచ్చింది. వీటిలో రూ.4 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులు, పూర్తి ఏసీ సౌకర్యంతో కూడి 75 మంది ప్రయాణికులు వెళ్లేలా ఎంఎల్ తామిరభరణి తయారీ పనులు పూర్తయ్యాయి.