‘రజినీని ఇబ్బంది పెట్టకండి.. ఏ పార్టీకి మద్దతివ్వరు’

ABN , First Publish Date - 2021-01-12T16:15:46+05:30 IST

‘రజినీని ఇబ్బంది పెట్టకండి.. ఏ పార్టీకి మద్దతివ్వరు’

‘రజినీని ఇబ్బంది పెట్టకండి.. ఏ పార్టీకి మద్దతివ్వరు’

చెన్నై : రాజకీయాల్లో రావాలంటూ అభిమాన సంఘాలు రజనీని ఇబ్బంది పెట్టడం తగదని గాంధీ మక్కల్‌ ఇయక్కమ్‌ నేత తమిళురివి మణియన్‌ ప్రకటించారు. తన నాయకత్వంలోని గాంధీ మక్కల్‌ ఇయక్కమ్‌ను రజనీ మక్కల్‌ మండ్రంలో విలీనం చేయనున్నట్టు ఆదివారం రాత్రి సామాజిక ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. కోయంబత్తూరులో ఆదివారం గాంధీ మక్కల్‌ ఇయక్కమ్‌ రాష్ట్ర, జిల్లాల శాఖ నిర్వాహకుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆ ఇయక్కమ్‌ అధ్యక్షుడిగా తమిళురువి మణియన్‌ కొనసాగించాలని నిర్వాహకులంతా ఆమోదించారు.


ఈ నేపథ్యంలో ఆ ఇయక్కమ్‌ త్వరలో రజనీ మక్కల్‌ మండ్రంలో విలీనం కానుందని ప్రసార మాధ్యమాల్లో వార్తలపై సోమవారం తమిళురివి మణియన్‌ మీడియాతో మాట్లాడారు. రజనీ రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం లేదు కనుకే తాను శేష జీవితాన్ని రాజకీయాలకు దూరంగా గడుపుతానని ప్రకటించానని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇయక్కమ్‌ను రజనీ మక్కల్‌ మండ్రంలో విలీనం చేసే ప్రసక్తేలేదని చెప్పారు.

Updated Date - 2021-01-12T16:15:46+05:30 IST