ప్రమాదం జరిగి పదిరోజులుగా ఇంట్లోనే ఉంటున్న భర్త.. ఆ సమయంలో భార్యను అలా చూసేసరికి..

ABN , First Publish Date - 2021-10-01T19:07:46+05:30 IST

పనిచేసే దగ్గర ప్రమాదం..

ప్రమాదం జరిగి పదిరోజులుగా ఇంట్లోనే ఉంటున్న భర్త.. ఆ సమయంలో భార్యను అలా చూసేసరికి..

సేలం(తమిళనాడు): పనిచేసే దగ్గర ప్రమాదం జరగడంతో భర్త ఇంటివద్దే ఉంటున్నాడు. ఆ సమయంలో భార్య చేస్తున్న పని చూసి తొందరపడి ఓ నిర్ణయం తీసుకున్నాడు. విషయమేమిటంటే..


తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన మురుగన్ అనే 33ఏళ్ల వ్యక్తికి, మురుగేశ్వరి అనే మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ బాబు, పాప ఉన్నారు. మురుగన్ స్థానిక ప్రాంతంలో పనిచేస్తూ ఉంటాడు. పది రోజుల క్రితం పని దగ్గర ప్రమాదం జరగడంతో.. అప్పటినుంచి ఇంటివద్దనే ఉంటున్నాడు. భార్యపై ముందునుంచి అనుమానం ఉన్న మురుగన్‌కు తాను ఇంట్లో ఉన్న సమయంలో కూడా భార్య గంటలకొద్దీ మాట్లాడుతుండడం చూసి.. మరింత అనుమానం పెంచుకున్నాడు. ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో పిల్లలతో కలిసి చనిపోవాలనుకున్నాడు. ఓ తోటలోకి వెళ్లి.. ముందుగా తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సెప్టెంబర్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.



ఆత్మహత్య చేసుకునేముందు మురుగన్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో భార్యను ఉద్దేశించి మాట్లాడాడు. మమ్నల్ని చంపాలనుకున్నావ్ కదా.. మేమే చనిపోతున్నామ్.. అని మురుగన్ ఆ వీడియోలో అనడం చూసి భార్య తీవ్రంగా బాధపడింది. తనకెప్పుడు అలాంటి ఆలోచన లేదని దు:ఖించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-10-01T19:07:46+05:30 IST