మళ్ళీ లాక్డౌన్ ప్రకటనతో నగరం నుంచి...
ABN , First Publish Date - 2021-04-10T18:21:18+05:30 IST
రాష్ట్రంలో మళ్లీ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి పలు నిబంధనలతో తాత్కాలిక లాక్డౌ
- నగరంలో అదనంగా 400 ఎంటీసీ బస్సులు
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో మళ్లీ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి పలు నిబంధనలతో తాత్కాలిక లాక్డౌన్ను ప్రకటించింది. అందులో భాగంగా బస్సుల్లో నిలబడి ప్రయాణాన్ని నిషేధం విధించింది. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు అదనంగా 400 బస్సులు నడపాలని మెట్రో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంటీసీ) నిర్ణయిం చింది. ఈ మేరకు శుక్రవారం ఎంటీసీ విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణం చేయరాదని, ఒక బస్సుల్లో 44 మంది కూర్చొనేందుకు, 25 మంది నిలబడి ప్రయాణించేందుకు అనుమతి ఉందని తెలిపారు. ప్రభుత్వ తాజాగా వెల్లడించిన నిబంధనలతో శనివారం నుంచి ప్రతిరోజు 300 నుంచి 400 అదనపు బస్సులు నడుపనున్నామన్నారు. అధిక రద్దీ ఉన్న చెంగల్పట్టు, గుడువాంజేరి, తాంబరం, కేళంబాక్కం, సెమ్మంజేరి, పెరుంబాక్కం, మనలి, కన్నగైనగర్, పెరంబూర్, అంబత్తూర్, ఆవడి, తిరువొత్తియూర్, రెడ్హిల్స్ తదితర మార్గాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ అదనపు బస్సులు నడుపనున్నామని, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించి ప్రయాణిం చాలని ఎంటీసీ విజ్ఞప్తి చేసింది.