తాండవ రిజర్వాయర్‌లో 372 అడుగుల నీటిమట్టం

ABN , First Publish Date - 2020-07-06T11:14:48+05:30 IST

తూర్పు-విశాఖ పరిధిలోని తాండవ రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో ..

తాండవ రిజర్వాయర్‌లో 372 అడుగుల నీటిమట్టం

కోటనందూరు, జూలై 5: తూర్పు-విశాఖ పరిధిలోని తాండవ రిజర్వాయర్‌లో నీటిమట్టం  పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 372 అడుగులుగా ఉంది. ఎగువ ప్రాంతాలైనా బొడ్డేరు, చోద్యం, గెడ్డలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రస్తుతం 500 క్యూసెక్కులు ఇన్‌స్లో వస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తాండవ అధికారులు అంటున్నారు. తాండవ రిజర్వాయర్‌ నీటిమట్టం 380 అడుగులు కాగా, ప్రస్తుత్తం 372 అడుగులకు చేరింది. 6 అడుగులు పెరిగితే కింద ప్రాంతాలకు హెచ్చరికలు చేసి సముద్రంలోకి వదిలేందుకు చర్యలు చేపడుతామని డీఈ రాజేంద్రకుమార్‌ తెలిపారు.

Updated Date - 2020-07-06T11:14:48+05:30 IST