ప్రతి గడపను తడతాం: షర్మిల

ABN , First Publish Date - 2021-10-19T22:19:47+05:30 IST

తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన లేదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు...

ప్రతి గడపను తడతాం: షర్మిల

కడప: తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన లేదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. ‘‘రాష్ట్రమంతా తిరుగుతాం, ప్రతి పల్లెకు పోతాం, ప్రతి గడపను తడతాం, ప్రజలతో మమేకం అవుతాం, ప్రజల కష్టాలను వారి నోటి నుంచి వింటాం,ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.’’ అని వ్యాఖ్యానించారు.రేపు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-10-19T22:19:47+05:30 IST