లక్ష్యం మేరకు పని దినాలు పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-06-24T05:24:27+05:30 IST
నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఈ నెలాఖరుకు ఉపాధి పనులను అధికారులు, సిబ్బంది పూర్తి చేయాలని ఆ పథకం జిల్లా అంబుడ్స్మన్ షేక్ మీరావళి ఆదేశించారు. బుధవారం లింగసముద్రంలోని కొత్త చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేస్తే ప్రభుత్వం నిర్ధేశించిన రూ.245 ల కూలీ పడుతుందన్నారు.
కార్యాలయంలో రికార్డుల తనిఖీ - జిల్లా అంబుడ్స్మెన్ షేక్ మీరావళి
లింగసముద్రం, జూన్ 23 : నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఈ నెలాఖరుకు ఉపాధి పనులను అధికారులు, సిబ్బంది పూర్తి చేయాలని ఆ పథకం జిల్లా అంబుడ్స్మన్ షేక్ మీరావళి ఆదేశించారు. బుధవారం లింగసముద్రంలోని కొత్త చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేస్తే ప్రభుత్వం నిర్ధేశించిన రూ.245 ల కూలీ పడుతుందన్నారు. అనంతరం ఆయన లింగసముద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని ఉపాధిహామీ కార్యాలయాన్ని సందర్శించి వర్క్ ఫైల్స్, ఎంబుక్స్, మస్టర్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు, సిబ్బందికి పనుల గురించి పలు సూచనలు చేశారు.