లక్ష్యం మేరకు పని దినాలు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-06-24T05:24:27+05:30 IST

నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఈ నెలాఖరుకు ఉపాధి పనులను అధికారులు, సిబ్బంది పూర్తి చేయాలని ఆ పథకం జిల్లా అంబుడ్స్‌మన్‌ షేక్‌ మీరావళి ఆదేశించారు. బుధవారం లింగసముద్రంలోని కొత్త చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేస్తే ప్రభుత్వం నిర్ధేశించిన రూ.245 ల కూలీ పడుతుందన్నారు.

లక్ష్యం మేరకు పని దినాలు పూర్తి చేయాలి
లింగసముద్రంలో ఉపాధిహామీ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న అంబుడ్స్‌మన్‌ షేక్‌ మీరావళి

కార్యాలయంలో రికార్డుల తనిఖీ - జిల్లా అంబుడ్స్‌మెన్‌ షేక్‌ మీరావళి

లింగసముద్రం, జూన్‌ 23 : నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఈ నెలాఖరుకు ఉపాధి పనులను  అధికారులు, సిబ్బంది  పూర్తి చేయాలని ఆ పథకం జిల్లా అంబుడ్స్‌మన్‌ షేక్‌ మీరావళి ఆదేశించారు. బుధవారం లింగసముద్రంలోని కొత్త చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేస్తే ప్రభుత్వం నిర్ధేశించిన రూ.245 ల కూలీ పడుతుందన్నారు. అనంతరం ఆయన లింగసముద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని ఉపాధిహామీ కార్యాలయాన్ని సందర్శించి వర్క్‌ ఫైల్స్‌,  ఎంబుక్స్‌, మస్టర్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు, సిబ్బందికి పనుల గురించి పలు సూచనలు చేశారు.


Updated Date - 2021-06-24T05:24:27+05:30 IST