‘ఉపాధి’ లేబర్‌ టర్నవుట్‌ టార్గెట్‌ తగ్గరాదు

ABN , First Publish Date - 2021-05-18T05:50:04+05:30 IST

జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం లేబర్‌ టర్నవుట్‌ ఇదే వేగంతో కొనసాగించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఎంపీడీవోలను, ఏపీవోలను ఆదేశించారు.

‘ఉపాధి’ లేబర్‌ టర్నవుట్‌ టార్గెట్‌ తగ్గరాదు
‘ఉపాధి’ పై సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

ఏలూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం లేబర్‌ టర్నవుట్‌ ఇదే వేగంతో కొనసాగించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఎంపీడీవోలను, ఏపీవోలను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి సోమవారం ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌తో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి  పథకం కింద ఈ వారం నియమించిన లేబర్‌ టర్నవుట్‌ టార్గెట్‌ సాధించినందుకు ఎంపీడీవోలను, ఏపీవోలను అభినందించారు. ఉపాధి   పనులు వద్ద కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ పనులు తక్కువగా ఉన్న మండలాల్లో వేగం పెంచాలని సూచించారు. రైల్వే అవెన్యూ ప్లాంటేషన్‌ కార్యక్రమంపై రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించి భూములను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఈ వీసీలో జేసీ వెంకటరమణారెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ భాస్కర్‌రెడ్డి, హౌసింగ్‌ పీడీ రామరాజు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రామస్వామి, డ్వామా పీడీ పాల్గొన్నారు.


Updated Date - 2021-05-18T05:50:04+05:30 IST